తెలంగాణ

telangana

ఎంపీ మిథున్ రెడ్డి రాకతో - పుంగనూరులో టెన్షన్ టెన్షన్ - AP MP Mithun Reddy pungauru Tour

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 1:25 PM IST

Tension in Punganur : ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పుంగనూరు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో రెడ్డెప్ప ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మిథున్‌రెడ్డి గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. మిథున్‌ రెడ్డి పర్యటనను నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.

Political Tension Raised in AP MP Mithun Reddy Tour
Political Tension Raised in AP MP Mithun Reddy Tour (ETV Bharat)

Political Tension Raised in AP MP Mithun Reddy Tour : ఏపీలో రాజంపేట ఏపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిథున్‌రెడ్డి పర్యటనను నిరసిస్తూ ఎన్డీయే కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లడంతో ఎన్డీయే కార్యకర్తలు నిరసనకు దిగారు. రెడ్డప్ప ఇంటి వద్ద గోబ్యాక్‌ మిథున్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఎన్డీయే కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఎన్డీయే కార్యకర్తల ఎదురుదాడితో పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసుల యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్‌ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details