Officer Sent C VIGIL Complaint Details to YSRCP Leaders: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రతి సారి ఒక కొత్త పద్ధతి తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరులను సైతం భాగస్వామ్యం చేస్తూ గత సాధారణ ఎన్నికల్లో సీ-విజిల్ యాప్ను తీసుకొచ్చింది. ఇందులో ఫిర్యాదుదారుల వివరాలు సైతం గోప్యంగా ఉంటాయి.
ఎన్నికల్లో జరిగే ఎటువంటి ఉల్లంఘనలైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తామని సీ-విజిల్ యాప్ గురించి ఎన్నికల సంఘం చాలా గొప్పగా చెప్పారు. సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం అన్నారు. అయితే ఇంతటి గొప్ప ప్రయోజనాలు ఉన్న సీ- విజిల్ యాప్ ప్రతిష్ఠ కొంతమంది అధికారుల తీరు కారణంగా మసకబారుతున్నట్లు అనిపిస్తోంది.
ఆ ముగ్గురూ పూర్తి వివరాలతో రావాలి - రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైసీపీ నాయకులకు ఓ అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంటుకు వైఎస్సార్సీపీ రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్లో ఈ నెల 19వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు సైతం ఉన్నారు.