ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు - కొనసాగుతున్న కూల్చివేతలు - Neha Reddy Illegal Constructions

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Neha Reddy Illegal Constructions Demolition: విశాఖలోని భీమునిపట్నం సాగరతీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఇటీవలే హైకోర్టు మరోసారి సృష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపవద్దని సూచించడంతో, జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు.

Neha Reddy Illegal Constructions Demolition
Neha Reddy Illegal Constructions Demolition (ETV Bharat)

Neha Reddy Illegal Constructions Demolition: విశాఖపట్టణం జిల్లా భీమిలి సముద్ర తీరంలో YSRCP నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్​జెడ్ (Coastal Regulation Zone) నిబంధనలు ఉల్లఘించి చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. బీచ్​లో ప్లాట్​ఫారం నుంచి పైకి పది అడుగులు నిర్మించిన రక్షణ గోడను కొన్ని అడుగులు మాత్రమే కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు, హైకోర్టు ఆదేశాలతో ప్లాట్​ఫారం వరకు రెండోసారి కూల్చివేస్తున్నారు.

విశాఖలోని అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలంటూ ఇటీవల న్యాయస్థానం జీవీఎంసీ అధికారులను ఆదేశించింది.

భీమిలిలో నాలుగు 4 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్​పై హైకోర్టు ఉత్తర్వులతో కొద్ది రోజుల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పర్యావరణశాఖ అనుమతులు లేకుండా విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను నెలమట్టం వరకూ కూల్చి వేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మరోసారి జీవీఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయండి - అధికారులకు హైకోర్టు ఆదేశం - Neha Reddy Illegal Construction

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details