ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు గుడ్​న్యూస్​ - ఆ పథకం కింద రూ.10 లక్షలు

కార్మికులు, పేదలకు వర్తించేలా చంద్రన్న బీమా పథకం - ఈసారి కుటుంబం మొత్తానికి

tdp_government_planning_to_implement_chandranna_bima_scheme
tdp_government_planning_to_implement_chandranna_bima_scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

NDA Government Planning To Implement Chandranna Bima Scheme : రాష్ట్రంలోని పేదలందరికీ వర్తించేలా చంద్రన్న బీమా పథకం సిద్ధమవుతోంది. కుటుంబంలో సంపాదనపరుడికే కాకుండా కుటుంబసభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కోటీ 21 లక్షల కుటుంబాల్లోని 3 కోట్ల మందికిపైగా ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కార్మికులు, పేదలకు బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సారి కుటుంబం మొత్తానికీ బీమా వర్తింపజేసేలా కార్యాచరణ తయారవుతోంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కార్మికులు, పేదలు మరింత కుదేలయ్యారు. కూటమి ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకం రూపకల్పనపై ఐఏఎస్​ (IAS), ఐఎఫ్​ఎస్​ (IFS) అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక అందజేయనుంది.

18 నుంచి 70 ఏళ్ల మధ్యవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు బీమా చెల్లించాలని ఆరుగురు అధికారుల బృందం ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కుటుంబం మొత్తానికీ బీమా వర్తింపజేయడంతోపాటు బీమా మొత్తాన్ని పెంచడం పట్ల కార్మిక వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ప్రజలకు గుడ్​న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP

'గత ప్రభుత్వంలో వైఎస్సార్​ బీమా తెచ్చారు. అది పేరుకే కానీ దాని వల్ల మాకు సాయం అందిందే లేదు. ఈ సారి చంద్రన్న బీమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సారి పేద ప్రజలకిది వర్తిస్తుందని నమ్ముతున్నాం. కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టకున్నాం.' - భవన నిర్మాణ కార్మికులు

వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన వైఎస్సార్​ బీమా పథకంలో భారీగా క్లెయిమ్‌లు పెండింగులో పెట్టారు. వీటిని పరిష్కరించాలంటే రూ. 229 కోట్లు కావాలి. చంద్రన్న బీమా అమలుకు ఏడాదికి 2 వేల 800 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా కాకుండా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలకు అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. ఇదే విషయాన్ని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది.

"దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుక'' - ప్రతి ఇంటికి, ప్రతి ఎకరాకూ నీళ్లు : సీఎం చంద్రబాబు - Chandrababu Speech at Grama Sabha

ABOUT THE AUTHOR

...view details