ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోజు చూసిన కన్నీటి గాథలు, ఇచ్చిన హామీలు నేటీకీ గుర్తున్నాయి: నారా లోకేశ్ - NARA LOKESH ON YUVAGALAM

మంత్రి నారా లోకేశ్​ యువగళం పాదయాత్రకు నేటికి రెండేళ్లు పూర్తి - శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు

Nara_Lokesh_on_Yuvagalam
Nara_Lokesh_on_Yuvagalam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2025, 3:36 PM IST

Nara Lokesh on Yuvagalam Padayatra:యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ. సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లని ఆయన గుర్తు చేశారు.

నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదని మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుంచి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చిందన్నారు. పాదయాత్ర ప్రతీ అడుగులో ప్రజల కష్టాలు చూసానని ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ తనకు గుర్తున్నాయని అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా- పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, తనను ఆదరించిన ప్రజలకు లోకేశ్​ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన నేతలు: నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నారాయణ, కొల్లు రవీంద్ర, డోలా బాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్‌, అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, శాసనసభ, మండలి ఛీఫ్‌ విప్​లు జీవి ఆంజనేయులు, పంచుమర్తి అనురాధలు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి వైఎస్సార్సీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా చేసిన యువగళం పాదయాత్రకు రెండేళ్లు అయ్యిందని గుర్తుచేశారు. ఆఖరుకు ఎత్తైన పీట వేసుకుని ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినా జగన్ ప్రభుత్వం వేధించిందని మండిపడ్డారు.

ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా వేడుకలు:యువగళం పాదయాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అశోక్ బాబు, ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. నారా లోకేశ్​ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. జగన్​ను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చో పెడతామని పాదయాత్ర తొలి రోజే చెప్పి చేసి చూపించిన నేత లోకేశ్​ అని ప్రశంసించారు. ఆనాడు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక ధైర్యం భరోసా కల్పిస్తూ పాదయాత్ర సాగిందని భూమిరెడ్డి గుర్తుచేశారు.

డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ స్పందన - ఏమన్నారంటే?

అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దు - జనసేన శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ బహిరంగ లేఖ

ABOUT THE AUTHOR

...view details