Leopard Wandering in Rajahmundry in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలకు చిక్కుతున్నా దానిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోన్లకు మాత్రం చిక్కడం లేదు. అయిదు రోజుల్లో రెండు పర్యాయాలు మాత్రమే కెమెరాకు చిక్కింది. దీని కదలికలను బట్టి ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నారు.
ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry
హైవేపై స్పీడ్ మిట్ బోర్డులు :జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా గమనించుకుంటూ నెమ్మదిగా వెళ్లాలని జాగ్రత్తలు చెబుతున్నారు. జాతీయ రహదారి 16పై సదరు ప్రాంతాల్లో స్పీన్లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : చిరుత సాధారణంగా జనావాసాల్లోకి రావడం తక్కువని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా చిరుత ఎదురుపడితే పరిగెత్తవద్దని తెలిపారు. చిరుతకు కాస్త దూరంగా ఉంటే అలాగే నిలబడి చేతులు పైకెత్తి దానివైపు ఒక కన్ను వేసి నెమ్మదిగా వెనక్కి నడవాలన్నారు. భయపడి పొదల మాటున నక్కి కూర్చుంటే జంతువు అని పొరబడి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ చిరుత దగ్గరగా ఎదురుపడితే చేతులు పైకెత్తి అరుస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్తే చిరుత కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.