ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అది చిరుతే' - ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

ట్రాప్‌ కెమెరాల్లో చిరుత స్పష్టంగా కనిపించినట్లు అటవీ శాఖాధికారులు వెల్లడి

LEOPARD_ROAMING_NEAR_BHIMADOLU
LEOPARD_ROAMING_NEAR_BHIMADOLU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

Leopard Roaming Near Bhimadolu Area in Eluru District :ఏలూరు జిల్లా భీమడోలు పరిసరాల్లో సంచరిస్తున్న జంతువు చిరుతపులి అని నిర్ధారణ అయ్యింది. భీమడోలు శివారు ద్వారకా తిరుమల మండల పరిధిలోకి వచ్చే అందనాలమ్మ చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత స్పష్టంగా కనిపించినట్లు అటవీ శాఖాధికారులు తేల్చి చెప్పారు. దీంతో అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. భీమడోలు మండలం అంబరుపేట, పోలసానిపల్లి, ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, అందనాలమ్మ చెరువు, కాట్రగడ్డ కల్యాణ మండపం పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. ఎవరు ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరిస్తూ సోమవారం టాంటాం వేయించారు. అధికారులు చిరుతను బంధించేందుకు డీఎఫ్‌వో ఆశాకిరణ్‌ నేతృత్వంలో బోన్లు ఏర్పాటు చేశారు.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details