Kodi Kathi Srinu Family Members Initiation: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరింది. సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్షం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ప్రకటించింది. చేయని నేరానికి అన్యాయంగా శ్రీను శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు జైల్లో మగ్గిపోతుంటే తల్లి ఆవేదన సీఎం జగన్కి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో ఎందుకు కోర్టుకు రాలేదని ప్రశ్నించారు.
కోడికత్తి కేసు శ్రీనివాస్ కుటుంబానికి అన్యాయం జరిగిందని ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ అన్నారు. విజయవాడ శ్రీరామా ఫంక్షన్ హాలులో శ్రీను తల్లి, సోదరుడు దీక్ష చేపట్టగా వారికి సమతా సైనిక్ దళ్ మద్దతు తెలిపింది. జగన్ కోర్టుకు హాజరై సాక్షం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శ్రీను తల్లి, సోదరుడికి అండగా సమతా సైనిక్ దళ్ ఉంటుందని ఫారుక్ హామీ ఇచ్చారు. చేయని నేరానికి అన్యాయంగా శ్రీను శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు జైలులో మగ్గిపోతుంటే ఆ తల్లి ఆవేదన సీఎం జగన్కి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో ఎందుకు కోర్టుకు రావడం లేదని నిలదీశారు. ఐదేళ్లవుతున్న శ్రీను కుటుంబానికి న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు.
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం