ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 1:02 PM IST

Updated : Feb 7, 2024, 6:52 PM IST

ETV Bharat / state

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు- ఎండలో జనం పడిగాపులు

Jagananna House Registration Problems In Guntur District : జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్‌, బయోమెట్రిక్‌ డివైజ్‌లు, ఇతర సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్నాయి. రిజిస్టేషన్ల కోసం రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నామని మహిళలు వాపోతున్నారు.

jagananna_house_registration_problems_in_guntur
jagananna_house_registration_problems_in_guntur

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు- ఎండలో జనం పడిగాపులు

Jagananna House Registration Problems In Guntur District :జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్‌, బయోమెట్రిక్‌ డివైజ్‌లు సక్రమంగా పనిచేయక రిజిస్ట్రేషన్లు (House Registration) మందకోడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నద్ధత లేకుండానే ఈ ప్రక్రియను చేపట్టడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల రిజిస్టేషన్ల కోసం రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నామని మహిళలు వాపోతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు

Jagananna House Registration Problems :జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందిన వారికి హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అయితే గుంటూరు జిల్లాలో తొలి రోజు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. పేరేచర్లలోని గ్రామ సచివాలయాల్లో అడుగడుగునా సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ కూలీలైన మహిళలు పనులు మానుకోని సచివాలయాలకు వస్తున్నారు. అయినా (Jagananna House) రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ విభేదాలతో ఆగిన జగనన్న ఇళ్ల స్థలాల పంపీణీ - నిరుపయోగంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం

House Registration Problems Due To YSRCP Govt Negligency : సర్వర్‌ సరిగ్గా పని చేయకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయని పేరేచర్ల సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేస్తున్నామని వివరించారు. ఈ టోకెన్ల కోసం ఉదయం 7, 8 గంటలకే కార్యాలయం వద్దకు లబ్ధిదారులు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన వారు సాయంత్రం వరకూ నిరీక్షించినా రిజిస్ట్రేషన్లు పూర్తికాని పరిస్థితి వస్తోంది. దీంతో మరో రోజు రాక తప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కరువైందని వీడియో వైరల్.. ఏది నిజం?

People fire due to slow House Registration :పేరేచర్ల 4వ గ్రామ సచివాలయం వద్ద ఆరుబయట ఎండలోనే లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రెండు, మూడు గంటల పాటు వేచి చూసిన తరువాత సర్వర్ (Technical Problems) పనిచేయడం లేదు, మధ్యాహ్నం 4 గంటల తరువాత రావాలంటూ అధికారులు, సిబ్బంది చెప్పడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు.

"బాబోయ్​.. ఈ స్థలాలు మాకొద్దు".. జగనన్న ఇళ్ల స్థలాలు తిరస్కరణ

Last Updated : Feb 7, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details