ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం - 8కి చేరిన మృతుల సంఖ్య - JABALPUR ROAD ACCIDENT

మినీ బస్సు-ట్రక్కు ఢీ - కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

Jabalpur Road Accident
Jabalpur Road Accident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 11:36 AM IST

Updated : Feb 11, 2025, 1:42 PM IST

Jabalpur Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. బాధితులను సిహోరాలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు హైవే పైకి రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Mahakumbh Devotees Killed in MP : మరోవైపు ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP29 W 1525గా పోలీసులు గుర్తించారు. అయితే మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఆంధ్రప్రదేశ్​ వాసులు అయి ఉంటారని తొలుత వారు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా నిర్ధారించారు. మృతులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శశికాంత్‌ కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఘోర ప్రమాదంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

లారీని ఢీకొట్టిన యాత్రికుల మినీ వ్యాన్ - నలుగురు దుర్మరణం - MADAKASIRA ROAD ACCIDENT TODAY

ఉచిత వైద్యం కోసం బయల్దేరిన వారి ప్రాణాలు రోడ్డుపైనే పోయాయి

Last Updated : Feb 11, 2025, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details