ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 12:51 PM IST

ETV Bharat / state

మత్తు కోరల్లో యువత జీవితం- తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే! - Increasing Drug Use In Nellore

Increasing Drug Use In Nellore District : రోజు రోజుకూ యువత మత్తు పదార్థాలకు బానిసవుతుంది. దీనికి నిదర్శంగా జరుగుతున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చిన్న వయసులోనే వీటికి అలవాటు పడుతున్నవారు విచక్షణా రహితంగా పలు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేరస్తులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

increasing_drug_use_in_nellore_distric
increasing_drug_use_in_nellore_distric (ETV Bharat)

Increasing Drug Use In Nellore District :మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు, సొల్యూషన్‌ ఇలా స్టఫ్‌ కోసం యువత ఎన్నో రకాలను ఉపయోగిస్తోంది. తాజాగా కొత్త రకమైనవి వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్‌ కవరులో పెయింటింగ్‌కు ఉపయోగించే ఒక రకమైన పదార్థాన్ని ఉంచి పీల్చుతున్నారు. చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయసులో పెడదోవ పడుతున్నారు. వేదాయపాలెంలోని పదో తరగతి చదివే బాలుడి విషయమే ఉదాహరణ. అతని తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆసుపత్రులకు తీసుకెళ్లినా కౌన్సెలింగ్‌ ఇప్పించినా రెండు రోజులకే పరిమితమవుతోంది. మళ్లీ మత్తు కోసం అన్వేషణ సాగిస్తున్నాడు.

  • వేదాయపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలోని జ్యోతినగర్‌లో పదో తరగతి చదివే ఓ బాలుడు మత్తుకు అలవాటు పడ్డాడు. పెయింటింగ్‌ పనులకు ఉపయోగించే ఒక పదార్థాన్ని ప్లాస్టిక్‌ కవరుతో ఊది మత్తును అస్వాదిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి ఈ అలవాటు ఉండగా తాజాగా మత్తులో పొరిగింట్లో అక్రమంగా ప్రవేశించాడు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే దాడికి పాల్పడ్డాడు.
  • నగరంలో జరుగుతున్న పలు హత్యలు, హత్యాయత్నాలు మత్తులో చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
  • నగరంలోని స్టేషన్ల పరిధిలో పోలీసులు నెలానెలా 150 మంది మత్తు బాధితులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వీరిలో ఎక్కువశాతం మత్తుకు బానిసైన వారిని తిరుపతి వ్యసన విముక్తి కేంద్రానికి పంపుతున్నారు.

విద్యార్థులనే ఆసరాగా చేసుకుని :లక్షలాది మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతోంది. మెట్రో నగరాలకే పరిమితమైన కొన్ని వాణిజ్య సంస్థలు నెల్లూరులో ప్రవేశిస్తున్నాయి. వ్యాపార పరంగా విద్యార్థులు, ఉద్యోగులను, మహిళలను ఆకర్షించేందుకు కొత్త తరహా సంస్కృతిని తెస్తున్నారు. అయితే చెడు వ్యసనాలు కూడా పెరిగాయి. ఉల్లాసం, ఉత్సాహం కోసం విద్యార్థులు మత్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అక్రమార్కులకు వీరు కల్పతరువుగా మారారు. కళాశాలలు, హాస్టళ్లు, గదులు వద్ద వీరి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర రకాల మాదక ద్రవ్యాలను సైతం యువతకు పరిచయం చేయిస్తున్నారు.

డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయికి 14 రోజుల రిమాండ్- వెలుగులోకి విస్తుపోయే నిజాలు - Drug Peddler Mastan Sai Arrested

తల్లిదండ్రుల బాధ్యత :నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బైకుల్లో రయ్‌ రయ్‌ అంటూ యువకులు దూసుకెళ్తున్నారు. మితిమీరిన వేగంతో వెళితే జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఇచ్చే పాకెట్‌మనీతో ఏం తీసుకుంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు తదితర అన్ని వివరాలు తెలుసుకోవాలి. వారు మారం చేశారని రూ.లక్షల విలువల చేసే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ఇవ్వడం కాదు, వారు భవిష్యత్తులో ఏం సాధించాలో నీతులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని పోలీసులు చెబుతున్నారు.

'మత్తుకు బానిసైన యువకులను కౌన్సెలింగ్‌తో మార్పు తీసుకురావొచ్చు. వ్యసనం మరింత ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే మార్పు వస్తుంది. భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాలు, అనర్థాలు వారికి వివరించాలి. అప్పుడే వారిలో ఆలోచించే విధానం వస్తుంది.'-డాక్టర్‌ సురేష్‌ బాబు, మనోవికాస నిపుణులు

మత్తు వలయంలో యువత చిత్తు- థ్రిల్‌ కోసం లైఫ్​ రిస్క్​ - Prathidhwani on Increasing Drugs

ABOUT THE AUTHOR

...view details