ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ - పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు - IAS TRANSFERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 6:13 PM IST
IAS Transfers in Andhra pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
![ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ - పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు - IAS TRANSFERS IAS Transfers in Andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/1200-675-21851524-thumbnail-16x9-ias-transfers-in-andhra-pradesh.jpg)
IAS Transfers in Andhra pradesh: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్గా ఏ.శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె. విజయ, కోనసీమ కలెక్టర్గా మహేష్ కుమార్, పలనాడు కలెక్టర్గా పీ. అరుణ్ బాబు, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా డీ. వెంకటేశ్వర, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకురి శ్రీధర్, కడప కలెక్టర్గా లోతేటి శివశంకర్, సత్య సాయి జిల్లా కలెక్టర్గా చేతన్, నంద్యాల కలెక్టర్గా బి.రాజకుమారి, విశాఖ కలెక్టర్గా హరేందిరా ప్రసాద్లను నియమించింది.