High Tension Electricity Poles Crop Field in Kurnool District :విద్యుత్ ప్రాజెక్ట్ రాకతో తమకు ఉపాధి దొరకుతుందని ఆశగా ఎదురుచూసిన రైతుల నెత్తిన హైటెన్షన్ టవర్ల పిడుగుపడింది. ఎకరా, రెండెకరాలు సాగుచేసుకుంటున్న సన్నా, చిన్నకారు రైతుల జీవితాల్లో విద్యుత్ టవర్లు చిచ్చురేపుతున్నాయి. కోట్ల విలువ చేసే భూముల విలువ వేలకు పడిపోయింది. అటు విద్యుత్ సంస్థ సైతం పరిహారం చెల్లించకుండా రైతులకు రెండు వైపులా నష్టం చేకూరుస్తోంది.
Kurnool District :ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెబుతున్న ఈ పరిశ్రమలో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ విద్యుత్ను కోడుమూరు వరకు తీసుకెళ్లేందుకు భారీ టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ విద్యుత్ టవర్లను రైతుల పొలాల మీదుగా తీసుకెళ్లడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీస సమాచారం లేకుండా ఇష్టానుసారం పొలాల్లో టవర్లు నిర్మాణం చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు నష్టపరిహారం ఊసే ఎత్తడం లేదని రైతులు మండిపడుతున్నారు. గ్రీన్కో సంస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టవర్ల ఏర్పాటుతో భూముల విలువ దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation