Dharani Application Consideration Deadline Extension :రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన కాంగ్రెస్ సర్కార్, ప్రత్యేక డ్రైవ్ను17 వరకు పొడిగించింది. ఇప్పటివరకు పెండింగ్లో రెండున్నర లక్షల అర్జీలను క్షేత్రస్థాయిలో(Field Level) పరిశీలించి పరిష్కరించే దిశగా కార్యచరణ ముమ్మరమైంది. కొత్త దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి నిరంతర ప్రక్రియగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కోటి 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి(Agricultural Land) చెరసాలలో పడినట్లయిందని విమర్శించారు. నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని వేలాది మంది రైతుల భూములను అగ్గువకు లాక్కున్నారని ఆయన ఆక్షేపించారు. 75 లక్షల కర్షకుల వెతలను తీర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నామన్న కోదండరెడ్డి, ధరణిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు వివరించారు.
వారం రోజుల్లో 76వేల దరఖాస్తులు పరిష్కరించాం : పొంగులేటి
Dharani Act Issues in Telangana : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేడు సంవత్సరాలుగా భూమి హక్కులు కోల్పోవటం జరిగిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. అదేవిధంగా భూ కుంభకోణాలు(Land Scams) ఎన్నోపెద్ద ఎత్తున జరిగాయని, సంతోష్ అనే ఓ రాజ్యసభ మెంబర్, వారి కుటుంబానికి సంబంధించిన వారి పేరు మీద కూడా ఎన్నో భూములు ఉన్నాయన్నారు. ఎట్లా అంత భూమి సంక్రమించిందని ప్రశ్నించారు. 2.45 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయటానికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇవ్వటం జరుగుతున్నాయని ఆయన తెలిపారు.