ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓ వైపు ప్రపంచ బ్యాంకు అధికారులు-మరోవైపు సమీక్షలతో బిజిబజీగా పవన్ కల్యాణ్ - Pawan Met WorldBank Representatives

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 10:04 PM IST

Pawan Kalyan Meeting with World Bank Representatives: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇంటింటికీ రక్షిత మంచి నీరు సరఫరా చేసే అంశంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై దృష్టి పెట్టారు.

pawan_met_worldbank_representatives
pawan_met_worldbank_representatives (ETV Bharat)

Pawan Kalyan Meeting with World Bank Representatives:ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు తదితరులు హాజరయ్యారు.

శాలువాలు బొకేలు వద్దు - కూరగాయలు ఇవ్వండి: పవన్​కల్యాణ్​ - Pawan Kalyan About Gifts

సముద్ర కోత నివారణపై దృష్టి:ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై డిప్యూటీ సీఎం ఎన్​సీసీఆర్​ రూపొందించిన ప్రణాళిక విడుదల చేశారు. సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందించారు.

చెత్తను సంపదగా మార్చవచ్చు:అంతకు ముందు అధికారులతో చెత్తతో సంపద సృష్టి అంశంపై అధికారులతో సమీక్షఇంచారు. ఘన వ్యర్థాలను 12 గంటల్లో సేకరించగలిగితే వాటిని సంపదగా మార్చవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చెప్పారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌పై అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను పిఠాపురంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పవన్ తెలిపారు.

పిఠాపురం నుంచే సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం: డిప్యూటీ సీఎం పవన్‌ - Deputy CM Pawan Kalyan Review

యువత కోసం ఎన్నారైల బస్సుయాత్ర - అక్టోబరు 2న ప్రారంభం - NRIs Startup Bus Trip Soon

ABOUT THE AUTHOR

...view details