తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగా 'న్యూ ఇయర్​ శుభాకాంక్షలు' చెప్పాలా అంటూ మెసెజ్​లు వస్తున్నాయా - అయితే జాగ్రత్త - CYBER CRIMINALS NEW YEAR WISHES

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో సైబర్​ కేటుగాళ్లు లింక్​లు - కొత్తగా న్యూ ఇయర్​ విసెస్​ అంటూ మెసెజ్​లు - లింక్​పై క్లిక్​ చేస్తే మీ సమాచారం చోరీ - హెచ్చరిస్తున్న సైబర్​ పోలీసులు

New Year Celebrations Crime
New Year Celebrations Crime (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2024, 5:32 PM IST

New Year Cyber Alert : ఇంకో నాలుగు రోజుల్లో నూతన ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల నుంచే స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ న్యూ ఇయర్​ శుభాకాంక్షలు చెబుతాం. ఇప్పుడు ఈ కొత్త సంవత్సర వేడుకలను సైబర్​ నేరగాళ్లు వారికి అనువుగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇదే తడవుగా దోచుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నూతన సంవత్సవ శుభాకాంక్షలను సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని చెబుతూ, వీటి కోసం ఈ కింద ఇచ్చిన లింక్​పై క్లిక్​ చేసి, మీ వివరాలు నమోదు చేస్తే చాలని సెల్​ఫోన్​లకు సందేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆ లింక్​పై పొరపాటున క్లిక్​ చేశారో ఇక మీపని గోవిందా.

సైబర్​ దొంగలు ఇలా ప్రతి పండగను, సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూ ఇయర్​ సెలబ్రెషన్స్​లో నూతన సంవత్సర శుభాకాంక్షలకు ప్రత్యేకం అంటూ ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్మార్ట్​ఫోన్, ల్యాప్​ట్యాప్​ ఉన్నవాళ్లు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారి చేతికి చిక్కుతారు. తర్వాత మీ రహస్య సమాచారం అంతా సైబర్​ కేటుగాళ్లకు చేరి వారి చేతిలో కీలుబొమ్మలు అవుతారు.

సెల్​ఫోన్​లో ఉన్న రహస్య సమాచారం అకౌంట్​ వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఖాతాలలోని డబ్బులు సైబర్​ కేటుగాళ్లు కాజేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే తెలియని నంబరు నుంచి న్యూ ఇయర్​ శుభాకాంక్షలు భిన్నంగా చెప్పాలనుకుంటే మెసెజ్​ లోపల లింక్​ క్లిక్ చేయమంటారని, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్​ చేయవద్దని సైబర్​ పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆండ్రాయిడ్​ ప్యాకేజీ కిట్​(APK) ఫైల్స్​ రూపంలో మెసెజ్​లు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

మీ సమాచారం మొత్తం సైబర్​ కేటుగాళ్ల చేతిలో :ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి మీ ఫోన్లోకి చొరబడిందంటే అందులోని మీ సమాచారం మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. ఏవైనా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్​ నంబర్లు, వీడియోలు, ఇతర ఫైల్స్​ అన్నింటినీ వారు తీసేసుకుంటారు. కావున నూతన సంవత్సర సందేశాల విషయంలో అలాంటి లింక్​లపై క్లిక్​ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని సైబర్​ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున సైబర్​ నేరగాళ్లు సందేశాలను పంపుతున్నారని, మరో రెండు, మూడు రోజుల్లో ఈ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కావున ప్రజలందరూ హ్యాపీగా నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్​ చేసుకోవాలంటే అలాంటి మెసెజ్​ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఓపెన్​ చేయకపోవడమే ఉత్తమం.

ఈ ఒక్క సూత్రం పాటించారంటే - మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు

కస్టమర్‌ కేర్‌ నంబర్ కోసం గూగుల్​లో వెతుకుతున్నారా? - ఐతే మోసపోవటం పక్కా!

ABOUT THE AUTHOR

...view details