ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పందెంరాయుళ్ల హవా- కోట్లలో కోడి పందేలు! - CRORES OF RUPEES BET ON COCKFIGHTS

సంక్రాంతి పండుగకు ముందే గుట్టుగా కోడి పందేలు- పట్టించుకోని పోలీసులు

cockfighting_preparations_ramp_up_ahead_of_sankranti_in_west_godavari
cockfighting_preparations_ramp_up_ahead_of_sankranti_in_west_godavari (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 8:51 AM IST

Cockfighting Preparations Ramp Up Ahead of Sankranti in West Godavari : సంక్రాంతి వచ్చిదంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. ఈ సారి పండుగకు ముందే పోటీలు జోరందుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. గుట్టుగా సంక్రాంతికి ముందే పందేలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎలాంటి హడావుడి లేకుండా పందేలు వేస్తున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పందేలపై ఆసక్తి ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న వారికి మాత్రమే నిర్వాహకులు సమాచారం ఇస్తున్నారు. బరులు ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి లేకుండా రాత్రి 7 గంటల తర్వాత ట్రాక్టర్లతో చదును చేసి, లైట్లు పెట్టి తెల్లారేలోగా కథ ముగించేస్తున్నారు.

ఒకే ప్రాంతంలో తరచూ పందేలు వేయకుండా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రెండు నెలలుగా ఒక్కో వారం ఒక్కో మండలంలో పందేలు వేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారు మాత్రమే బరిలోకి వచ్చేలా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీయకుండా ముందుగానే ఫోన్లు తీసుకుంటున్నారు. తాజాగా ఉండి మండలం సీసలిలో భారీ ఎత్తున పందేలు వేశారు. ఒక్కో పందేనికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున రూ.50 లక్షలకు పైగా చేతులు మారాయని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భీమవరం శివారులోని ఖాళీ స్థలాల్లో రాత్రంతా నిర్వహించారు.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు - పందెం కోళ్లు రెఢీ!

చేతులు మారుతున్న రూ.కోట్లు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఆకివీడు, కామవరపుకోట, కలిదిండి, దెందులూరు, పెదవేగి తదితర మండలాల నుంచి కోళ్లను భారీగా కొనుగోలు చేశారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున కోళ్లు గోదావరి జిల్లాల్లో కూత పెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు చిన్నా పెద్ద అన్ని పందేల్లో కలిపి దాదాపు రూ.100 కోట్లు చేతులు మారాయని తెలుస్తోంది. పందేలు నిర్వహించేవారిపై చర్యలు తీసుకుంటామని, బైండోవర్‌ చేసి నియంత్రిస్తామని ఏలూరు రేంజి డీఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఆ పుంజు స్పెషల్​ - రేటు తెలిస్తే షాక్​

ABOUT THE AUTHOR

...view details