ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఆ ఆరు పాలసీలే గేమ్ ఛేంజర్" - మద్యంలో వేలు పెడతామంటే కుదరదు : చంద్రబాబు వార్నింగ్

వైఎస్సార్సీపీ ఎందుకు 11కి పడిపోయిందో గ్రహించాలి - ప్రజలు మనల్ని కూడా అనుమానించే పరిస్థితి తెచ్చుకోవద్దన్న చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

cm_chandrababu_naidu_comments
cm chandrababu naidu comments (ETV Bharat)

CM Chandrababu Naidu Comments: ప్రజా ప్రతినిధుల ప్రవర్తన వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు. ఇసుక, మద్యం విధానాల్లో వైఎస్సార్సీపీ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

Chandrababu in TDP Meeting: ప్రభుత్వం చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్ట నష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా, ఇంతగా అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని వ్యాఖ్యానించారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదని, కేంద్ర నిధుల్ని సైతం ఇష్టానుసారం మళ్లించేశారని మండిపడ్డారు.

అంతర్జాతీయ స్థాయిలో మోదీయే మన బ్రాండ్‌ - సీఎం చంద్రబాబు

Chandrababu on Preparation for Next Elections: నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా, చెడకొట్టుకోవాలనుకుంటే నిమిషం చాలన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిదులకు స్పష్టం చేశారు. తనతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుందన్నారు. తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే నిన్న ప్రధాని ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో 5 గంటలు కూర్చున్నారని, ఇక్కడ మనమూ అదే సిద్ధాంతాన్ని అనుసరించాలని తేల్చిచెప్పారు.

గత 5 ఏళ్లు సాగిన అరాచకం కారణంగా తనతో సహా, ప్రజలు, నేతలు అంతా ఇబ్బంది పడ్డారని, గెలిచాం కాబట్టి ఇక మనపనైపోయిందనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలని హితవు పలికారు. యువత, విద్యావవంతలు ఇలా దాదాపు 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, మంత్రుల్లో 18 మంది కొత్తవారే ఉన్నారని గుర్తుచేశారు. ప్రతీ ఇంట్లోనూ చిన్నపాటి సమస్యలుండి సమన్వయం చేసుకున్నట్లే, కుటుంబం లాంటి పార్టీలోనూ ఉండటం సహజమని చెప్పారు.

Chandrababu on Leaders Behaviour: ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడ ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదన్న చంద్రబాబు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదని ఈ వ్యత్యాసాన్ని గమనించాలని సూచించారు. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలమన్నారు. ఎన్డీఏలో ఎవ్వరు తప్పు చేసినా ఆ ప్రభావం ముఖ్యమంత్రి మీదే ఉంటుందని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు.

"సమయం లేదు మిత్రమా" - ఏపీలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

Chandrababu Warning to MLAs: ఇసుక, మద్యం విధానాల్లో వైఎస్సార్సీపీ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే పార్టీకి, నేతలకూ ఇబ్బందే అని స్పష్టం చేశారు. ఇసుక, మద్యం అంశాల్లో ప్రతీ ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు. మాగుంట కుటుంబం ఎప్పటి నుంచో మద్యం వ్యాపారంలో ఉందని, అలాంటి వాళ్లు తప్ప మిగిలిన వాళ్లు కొత్తగా మద్యంలో వేలు పెడతామంటే కుదరదని తేల్చిచెప్పారు. మద్యంలో వైఎస్సార్సీపీ నేతలు దోచిన డబ్బు బస్తాలు బస్తాలుగా వారి దగ్గర ఉందని విమర్శించారు. మన దగ్గర మంచి లేకపోతే, డబ్బు ద్వారా ఏ ఎన్నికా గెలవలేమని వ్యాఖ్యానించారు. మద్యం, ఇసుక విధానాలపై మళ్లీ విడిగా అందరితో మాట్లాడతానని చెప్పారు.

CBN on Industrial Parks: ప్రతీ నియోజకవర్గంలో ఒకటీ అంతకంటే ఎక్కువ పారిశ్రామిక పార్కులు పెట్టనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల భాగస్వామ్యంతోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల భూముల్ని అభివృద్ధి చేసేందుకు డెవలపర్స్ ముందుకొస్తే, రైతులకు పరిశ్రమల్లో భాగస్వాముల్ని చేసి వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ తవ్విపోయిన గుంతలను దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి మనం పూడ్చుతున్నామని చెప్పారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత నాయకులదే అని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు మాదిరి ప్రభుత్వం సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చిందని, ఇవి గేమ్ ఛేంజర్ కానున్నాయని వివరించారు.

రాజధానిలో అభివృద్ధికి భారీగా నిధులు - వాటి నిర్మాణానికి వందల కోట్లు

Chandrababu on NDA Allaince: 2029లో మళ్లీ గెలవాలంటే ఎన్డీఏను అనుసంధానం చేసుకోవాలని చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులతో పాటు కేంద్రం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మూడు పార్టీలు సమన్వయం చేసుకోవటం, అవసరమైన సందర్భాల్లో అధ్యక్షులు మాట్లాడుకోవటం చేస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని 41నియోజకవర్గాల్లో టీడీపీని కాపాడుకోవటంతో పాటు మిత్రపక్ష ఎమ్మెల్యేలకు అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు.

ఎవరిదారి వారు చూసుకుంటే మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టీ ప్రతీ నియోజకవర్గంలో 3 పార్టీల సమన్వయం అవసరమని తేల్చిచెప్పారు. ప్రతీ సమస్యా తన దగ్గరకే రావాలి, తానే పరీష్కరించాలంటే కుదరుదని, మంత్రులూ దీనికి బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజా వినతుల పరిష్కరించటానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి బాధితుల్లో నమ్మకం పెంచాలన్నారు. వచ్చే ప్రతీ వినతీ సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో వివరణ ఇవ్వాలి, సాధ్యమయ్యే ప్రతీ వినతీ పరీష్కరించాలని స్పష్టం చేశారు.

'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్​ అందుతుంది'

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details