Chandrababu Fires on Government Letter: ప్రభుత్వం, వివిధ సంస్థల్లో కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు కట్టబెడుతున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల ముంగిట మరింత జోరు పెంచింది. ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు మూడింటితో పాటు, ఉపలోకాయుక్త పోస్టును భర్తీ చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రెండు కమిటీల సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశాలకు రావాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu)కు లేఖలు పంపింది. కేవలం ఒకటి, రెండు రోజుల ముందు సమాచారం పంపి సమావేశాల (Meeting)కు పిలవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల గురువారం సమావేశాలకు రాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
CBN Angry on Jagan: నాది ముందుచూపు.. జగన్ది దొంగచూపు: టీడీపీ అధినేత చంద్రబాబు
Letter To Chandrababu For Appointment of State Information CommissionerMeeting: ఈ మేరకు ఆయన బుధవారం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖకు లేఖలు పంపారు. 3 రోజుల ముందు సమాచారం ఇవ్వడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి బయోడేటాలు పంపిస్తే వారి నేపథ్యం, అర్హతల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. "సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశానికి రావాలని ఈ నెల 5న ప్రభుత్వం నోటీసు పంపింది. ఆ లేఖ అదే రోజు తనకు అందిందని బాబు స్పష్టం చేశారు. కనీసం రెండు వారాల గడువు ఇచ్చి, ఆ తర్వాత సమావేశం జరపాలి" అని సాధారణ పరిపాలన శాఖ (జీపీఎం అండ్ ఏఆర్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.