ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి తక్కువ ధరకే ఊటీ, కన్యాకుమారి, మదురై వెళ్లొచ్చు - ఫుడ్, బెడ్​ అంతా వారిదే - BUSES FROM TIRUPATI TO MADURAI

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ స్పెషల్ ప్యాకేజీలు - తిరుపతి నుంచి కొత్తగా 4 ప్యాకేజీలు అందుబాటులోకి

AP TOURISM DEPARTMENT PACKAGE
AP TOURISM DEPARTMENT PACKAGE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 10:38 AM IST

Buses From Tirupati to Madurai: తిరుపతి నుంచి రామేశ్వరం, మదురై, ఊటీ, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో బస్‌ ప్యాకేజీల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం జరిగేది. అయితే ప్రస్తుతం ఈ విధమైన దర్శన టిక్కెట్లు రద్దు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన పర్యాటకాభివృద్ధి సంస్థ తమకు చెందిన బస్సులను ఇతర మార్గాల్లో వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది.

తిరుపతి నుంచి కోయంబత్తూరు, ఊటీ వయా చెన్నై: ఇందులో భాగంగా భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా నాలుగు స్పెషల్ బస్‌ ప్యాకేజీలను తీసుకొచ్చింది. తిరుపతి నుంచి కోయంబత్తూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనుంది. అయిదు రోజులపాటు ( 5 డేస్, 4 నైట్స్) యాత్ర ఉంటుంది. దీని టికెట్ ధర పెద్దలకు 4210 రూపాయలు, చిన్న పిల్లలకు 3370 రూపాయలుగా ఉంది.

తిరుపతి నుంచి మైసూరు, ఊటీ వయా బెంగళూరు:మరో ప్యాకేజీలో భాగంగా తిరుపతి నుంచి మైసూర్‌కు ప్రతి బుధవారం బస్సు నడపనున్నారు. ఈ టికెట్​ ధర పెద్దలకు 3020 రూపాయలు, చిన్న పిల్లలకు 2420 రూపాయలుగా ఉంది. ఇది కూడా అయిదు రోజుల పాటు కొనసాగనుంది.

తిరుపతి- రామేశ్వరం-కన్యాకుమారి- మధురై- శ్రీరంగం-తిరుపతి వయా చెన్నై: మరో ప్యాకేజీ తిరుపతి నుంతి శ్రీరంగం వరకూ నాలుగు రోజుల పాటు (4 డేస్, 3 నైట్స్) ఉంది. ఇది ప్రతి గురువారం అందుబాటులో ఉంచారు. దీని టికెట్ ధరలు పెద్దలకు 5600, చిన్న పిల్లలకు 4480 రూపాయలుగా నిర్ణయించారు.

ఇక నాలుగో ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభమై కాణిపాకం, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్​ సందర్శన తరువాత తిరిగి తిరుపతికి చేరుకుంటుంది. ఇది ఒక రోజు ప్యాకేజీ. ఉదయం 6 గంటలకు మొదలై, రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. దీని టికెట్ ధర పెద్దలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే ఉంది. చిన్న పిల్లలకు 960 రూపాయలుగా నిర్ణయించారు.

ఈ ప్యాకేజీలలో అల్పాహారం, భోజన సదుపాయం, వసతి కల్పించేవి కూడా ఉన్నాయి. అంతే కాకుండా మల్టీ యాక్సిల్‌ ఏసీ వాల్వో ఒక్కో బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 40 సీట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్స్​ కోసం ఏపీటీడీసీ వెబ్‌సైట్​ని సందర్శించవచ్చు. టికెట్ల ధరలు, ఇతర వివరాలకు 9848007024, 9848850099, 9848973985 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు సూచించారు.

ఏపీఎస్ఆర్టీసీ గుడ్​న్యూస్​ - కుంభమేళాకు వెళ్లేవారికి ప్రత్యేకంగా బస్సులు

కాశీ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం - IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ

ABOUT THE AUTHOR

...view details