తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకు ఎప్పుడిస్తారో! - 4 సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల గంపెడాశలు - GOVT SCHEMES LATEST UPDATES

సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల ఆశలు - రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల డబ్బుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు

Beneficiaries hopes for 4 welfare schemes
Beneficiaries hopes for 4 welfare schemes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 9:44 AM IST

Beneficiaries hopes for 4 welfare schemes : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాల లబ్ధి తమకు ఎప్పుడు దక్కుతుందోనని అర్హులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలానికో పంచాయతీని ఎంపిక చేసి, గణతంత్ర దినోత్సవం రోజు (జనవరి26)న లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్కరి అకౌంట్​లో రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాలను ప్రకటించగా, రానివారు దరఖాస్తులు చేశారు. ఆ వివరాలను ప్రస్తుతం అంతర్జాలంలో ఎంటర్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్‌ రావడంతో ఈ పథకాల అమల్లో ఏమైనా జాప్యం జరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఎన్నికల కోడ్‌ రాక ముందే పథకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆటంకం ఉండదని గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు చెబుతున్నారు.

మండలానికి ఒకటి చొప్పున :కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోమండలానికి ఒకటి చొప్పున 15 పంచాయతీల్లోని 19 గ్రామాల్లో 4 పథకాలను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రైతు భరోసా పథకానికి సంబంధించి 4,963 మంది రైతులను ఎంపిక చేశారు. కానీ 4,344 మంది అకౌంట్లలో రూ.6 వేల చొప్పున రూ.8.26 కోట్లను విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 400 మందిని ఎంపిక చేసినప్పటికీ ఎంతమందికి నిధులు జమయ్యాయో వివరాలు లేవు. 573 మందికి రేషన్‌ కార్డులను మంజూరు చేశారు. వీరికి బియ్యం ఎప్పటి నుంచి ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. 2,124 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు అందించారు.

కొనసాగుతున్న కసరత్తు :గ్రామ సభల్లో 1,45,481 మంది రైతులు 4.43 లక్షల ఎకరాలు భూమిని కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా మరో 852 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో సాగుకు యోగ్యం కాని భూ వివరాల సర్వే ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు 360 గ్రామాల్లో 1,050 ఎకరాలు సాగుకు యోగ్యం కానివిగా అధికారులు గుర్తించి ఆ వివరాలను అంతర్జాలంలో ఎంటర్ చేశారు. ఇంకా 74 గ్రామాల్లో సర్వే చేపట్టాల్సి ఉంది. అది పూర్తయితే లెక్క తేలుతుంది.

  • ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ పథకంలో గతేడాది ఇరవై రోజులు పని చేసిన, భూమి లేని వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. గ్రామ సభల్లో 18,608 మందిని గుర్తించగా కొత్తగా 6,403 మంది దరఖాస్తులు సమర్పించారు. స్లాబు మినహా రేకులు, గూన, తడకలు, ఇలా ఎలాంటి ఇల్లు ఉన్నా వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కొన్ని నిబంధనలు విధిస్తూ సర్కారు ప్రకటించింది. గ్రామ సభల్లో భాగంగా 92,659 మంది అర్హులను అధికారులు గుర్తించారు. కొత్తగా మరో 12,866 దరఖాస్తులు వచ్చాయి. ఆ వివరాలను అంతర్జాలంలో నమోదు చేసి అర్హులను గుర్తించాల్సి ఉంది. నియోజకవర్గానికి 3500 అంటే జిల్లాలో 7వేల ఇళ్లు వస్తాయి.
  • ఆహార భద్రత కార్డుల కోసం 16,283 మందిని అధికారులు అర్హులుగా తేల్చారు. వీరే కాకుండా 24,290 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సి ఉంది.

ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు పడ్డాయి! - ఓసారి చెక్ చేసుకోండి

ప్రభుత్వం గుడ్​న్యూస్ - ఇక నుంచి వారికీ రైతు భరోసా

ABOUT THE AUTHOR

...view details