ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌కి ముమ్మరంగా ఏర్పాట్లు

అమరావతిని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేలా డ్రోన్ సమ్మిట్ నిర్వహణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 11 hours ago

AMARAVATI_DRONE_SUMMIT_2024
AMARAVATI_DRONE_SUMMIT_2024 (ETV Bharat)

Amaravati Drone Summit 2024 : డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్​ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 22, 23 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెనెంటర్లు, ఇన్వెస్టర్లతో పాటు ఐఐటీల నుంచి ప్రతినిధులు, వివిధ డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

రాష్ట్రంలో డ్రోన్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 పేరిట పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో డ్రోన్ సమ్మిట్, డ్రోన్ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఉన్న ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు, డ్రోన్ తయారీ కంపెనీలు, స్టార్టప్‌లు ఈ సమ్మిట్​లో భాగస్వామ్యం కానున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో ఏర్పాట్లను డ్రోన్‌ కార్పొరేషన్ ఎండీ దినేష్‌కుమార్‌తో పాటు ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు పరిశీలించారు.
Drone Summit in Mangalagiri :డ్రోన్ సమ్మిట్‌లో ఆయా అంశాలకు చెందిన ప్యానల్ డిస్కషన్లు, కాన్ఫరెన్స్​లను నిర్వహించనున్నారు. డ్రోన్ హ్యాకథాన్, సమ్మిట్ కోసం వెయ్యి మందికి పైగా డ్రోన్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయం, వైద్యం, మ్యాపింగ్, భూసర్వే ప్లాటింగ్, మీడియా, అటవీ అభివృద్ధి లాంటి అవసరాలకు డ్రోన్ల వినియోగం జరుగుతోంది. భవిష్యత్‌లో డ్రోన్ల సాంకేతికతను ఇతర అవసరాలకు విస్తరించేలా సాంకేతికతపై సదస్సులో చర్చించనున్నారు. 9 అంశాల్లో ప్యానల్ డిస్కషన్స్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు డ్రోన్ల వినియోగంలో తీసుకురావాల్సిన నిబంధనలు, నియంత్రణ వంటి అంశాలపైనా రెండు రోజుల సదస్సులో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో :ఈ నెల22 తేదీ సాయంత్రం విజయవాడ పున్నమీ ఘాట్ వద్ద డ్రోన్ షో జరగనుంది. సుమారు 5,500 డ్రోన్లతో దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో నిర్వహించనున్నారు. దీంతోపాటు లేజర్ బీమ్ షో లాంటి ఆకర్షణల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డ్రోన్ సమ్మిట్‌కు సాంకేతికతపై ఆసక్తి ఉన్న వారంతా హాజరు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

మంగళగిరిలో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిట‌ల్‌గా మార్చాలని నిర్ణయం!

డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా 'అమరావతి'! - దేశంలోనే మొదటిసారిగా 5,500 డ్రోన్లతో షో

ABOUT THE AUTHOR

...view details