ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ టెట్​పై విద్యాశాఖ క్లారిటీ - ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు - AP TET 2024 Syllabus

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 9:15 PM IST

AP TET 2024 Syllabus: ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహలు వద్దని, ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్‌ ఆధారంగానే అభ్యర్థులు సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. టెట్‌ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

AP TET 2024 Syllabus
AP TET 2024 Syllabus (ETV Bharat)

AP TET 2024 Syllabus: ఏపీలో 16 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా టెట్‌ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు.

అపోహలు వద్దు: ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహలు వద్దని సూచించారు. ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి పేర్కొన్నారు. పాత సిలబస్ ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడొద్దన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్ధారించామని, అందువలన దానిని వెబ్​సైట్​లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు టెట్​కు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - జులై 2 నుంచి ఓపెన్‌కానున్న వెబ్‌సైట్‌ - AP TET NOTIFICATION 2024

Andhra Pradesh TET Notification 2024 :కాగాఏపీలో 16 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో టెట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి సంబంధించన ప్రత్యేక ప్రకటన వచ్చే వారం విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు (TET) 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

గతంలో ఆంధ్రప్రదేశ్​లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు గత ప్రభుత్వం టెట్​ను నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35 లక్షల మంది హాజరైతే, వారిలో లక్షా 37 వేల 903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16 వేల 347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్​లో ఫెయిలైన వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా మరోసారి టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

AP DSC Notification Cancelled: మరోవైపు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను ఇప్పటికే రద్దు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6 వేల 100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.

టెట్‌లో అర్హత సాధించని వారికి నారా లోకేశ్ శుభవార్త- మరోసారి పరీక్ష ఉంటుందని ప్రకటన - nara lokesh on ap tet results

ABOUT THE AUTHOR

...view details