Storms in the Bay of Bengal in October: ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. | Read More
By Andhra Pradesh Live News Desk
Published : 4 hours ago
|Updated : 15 minutes ago
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 2 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Oct 02 2024- బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal
బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal
వరంగల్లో ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం - Gang Rape On Pharmacy Student
Gang Rape On Pharmacy Student : కోల్కతాలో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన మరవకముందే, రాష్ట్రంలో సామూహిక అత్యాచార ఘటన వెలుగు చూసింది. పరిచయమున్న వ్యక్తి ఓ ఫార్మసీ విద్యార్థినిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. | Read More
నవహ్నిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన సప్తగిరులు - Navahnika Brahmotsavam Starts oct 4
Saptagiri Arrangements for Srivari Navahnika Brahmotsavam : శ్రీవారి నవహ్నిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. పెరటాసి మాసం, సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలను దర్శించుకోనున్నారు. గరుడోత్సవం రోజున భారీగా శ్రీవారిని దర్శించుకోనున్నారన్న అంచనాతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాడవీధుల్లో గ్యాలరీల ఏర్పాటు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు సిద్ధం చేశారు. | Read More
విద్యుత్తు కాంతుల్లో ఇంద్రకీలాద్రి - తుది దశకు చేరిన దసరా ఏర్పాట్లు - Dasara Sharan Navaratri 2024
Dasara Sharan Navaratri Celebrations 2024 : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. ఉత్సవాల్లో భక్తుల ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతిచోటా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. | Read More
అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati
World Bank Rs 15,000 Crore Loan to Amaravati: ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ పంపింది. నవంబరు 15 నాటికి ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. ఆ వెంటనే అడ్వాన్స్గా రూ.3,750 కోట్లు తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది. | Read More
వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం నల్లిక్రీక్కు శాపం - కాలువ ఆధునికీకరణ నిలిపివేత - Nalli Creek in West Godavari
YSRCP Government Neglect Nalli Creek in West Godavari : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. ఆక్వా, ఉప్పు రైతులు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడే నల్లిక్రీక్ను నిర్లక్ష్యం చేసింది. నల్లిక్రీక్ పూడిక తీయకుండా, కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టకుండా తీర ప్రాంతాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. సముద్రపు అటుపోట్లతో పాటు వర్షాలు వచ్చిన ప్రతీసారి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. | Read More
గతపాలకుల నిర్లక్ష్యం - అస్తవ్యస్తంగా గ్రామీణ రోడ్లు - Damaged Roads in prakasam
People Suffering Due to Damaged Roads in Prakasam District : ప్రకాశం జిల్లాలో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి. గత పాలకులు నిర్లక్ష్యంతో రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. వర్షం వస్తే గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన స్పందించి రోడ్లుపైన ఉన్న గుంతలు పూడ్చాలని కోరుకుంటున్నారు. | Read More
మందుబాబులకు మరో శుభవార్త - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops
Application For New Liquor Shops in AP: రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా, మొదటిరోజైన మంగళవారం 200కు పైగా వచ్చాయి. ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశముంది. మద్యం దుకాణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్పోర్టల్ తీసుకొచ్చింది. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ విక్రయిస్తారు. | Read More
ఏకశిలతో మహాత్ముడి విగ్రహం - ఆ జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా గాంధీ గుడి! - Mahatma Gandhi Jayanti 2024
Mahatma Gandhi Temple in Narasaraopet: మహాత్మాగాంధీ అహింస అనే ఒకే ఒక్క మాటతో కోట్లాది మందిని శాంతి మార్గంలో నడిపించిన మహనీయుడు. స్వాతంత్య్ర సమరంలో దేశానికి విజయం అందించిన పోరాట యోధుడు. అలాంటి మహానీయుడి విగ్రహాలను ఊరురా, వాడవాడలా ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటోంది యావత్ భారతదేశం. జాతిపితను వీధుల్లో విగ్రహాలకే పరిమితం చేయకుండా ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ గుడి నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. | Read More