ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శరన్నవరాత్రి ఉత్సవాలు - గాయత్రీ దేవిగా అమ్మవారు - 2nd Day Sarannavarathrulu

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండోరోజు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Published : 4 hours ago

dasara_celebrations_in_vijayawada_2024
dasara_celebrations_in_vijayawada_2024 (ETV Bharat)

Sarannavarathrulu Celebration On Indrakeeladri :ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీ దేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేడు పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హరినాథ్‌, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ - Dasara Celebrationson Indrakeeladri

Dasara Celebrations in Vijayawada 2024 : గాయత్రీ దేవి వేదమాత అని, అన్ని మంత్రాలకు మూలశక్తి అని ఆలయ పండితులు పేర్కొన్నారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుందని తెలిపారు. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుందని అన్నారు. ప్రాత సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సావిత్రి, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ఈమెను ధ్యానిస్తారన్నారు. ఈ తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్ర శక్తి కలుగుతుందని తెలిపారు. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయని, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని తెలిపారు. గాయత్రీ మంత్ర పారాయణ వేదపారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుందని యనమంద్ర ఉమాకాంత్‌ శర్మ తెలిపారు.

రెండో రోజు వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు గాయత్రి దేవిని దర్శించుకున్నారు. వేద మంత్రాలతో పండితులు అమ్మవారికి పూజలు సమర్పించారు. భక్తులు కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇంద్రకీలాద్రి శోభాయమానం - మరికొద్ది గంటల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - Dasara Arrangements Indrakeeladri

ABOUT THE AUTHOR

...view details