TDP Ra Kadali Ra Sabha : శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూన రవికుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు రా కదలిరా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టీడీపీ - జనసేన పార్టీలు మేనిఫెస్టో ప్రకటించే ముందు సభ అని, రా కదలిరా చివరి సభ అని చెప్పారు.
జగన్కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు (Chandrababu) మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. నంద్యాలలో ఆగిపోయిన యాత్ర మళ్లీ ప్రారంభించుకున్న నేపథ్యంలో ఇక్కడ జరగనున్న రా కదలి రా సభ చివరిది కానుంది. ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 28న టీడీపీ-జనసేన సభ నిర్వహించి మ్యానిఫెస్టో ప్రకటించడానికి ఒకరోజుగా ముందు జరిగే రా కదలి రా సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి.
ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్, జగన్ది పాయిజన్: చంద్రబాబు