ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం తీస్తున్నారు! - కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు - E WASTE GOLD RECOVERY CHEMICALS

ఇంటింటికీ తిరిగి పాత సెల్​ఫోన్లు కొంటున్నదీ అందుకేనట - వాటి నుంచి బంగారం వెలికితీత

e_waste_gold_recovery_chemicals
e_waste_gold_recovery_chemicals (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2025, 10:41 AM IST

E waste gold recovery chemicals :'పాత సెల్​ఫోన్లు కొంటాం' అంటూ ఈ మధ్య ఇంటింటికీ వస్తుండడాన్ని గమనించారా? సెల్​ఫోన్లలోని చిప్స్ తయారీలో బంగారం ఉపయోగిస్తారు. కొన్ని శాస్త్త్రీయ పద్ధతుల్లో బంగారాన్ని తిరిగి వేరుచేసే అవకాశం ఉండడమే అందుకు కారణం.

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యుగం నడుస్తోంది. విద్యుత్ ఉపకరణాల వాడకం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ-వ్యర్థాలు కూడా అదే మోతాదులో పేరుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 62 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తుండగా ఇందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. రీసైక్లింగ్ ప్రాసెసింగ్ వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు అధికంగా ఖర్చవుతున్న నేపథ్యంలో అమెరికన్ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. తద్వారా వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రీసైక్లింగ్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీయడం దీని ప్రధాన ఉద్దేశం.

అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

e_waste_gold_recovery_chemicals (ETV Bharat)

సాధారణంగా, బంగారం వెండి వంటి లోహాలు భూమి లోపలి పొరల్లో లభిస్తాయి. అయితే, ఎలక్ట్రానికి 'ఈ వేస్టేజీ' నుంచి బంగారం ఎలా తీస్తారని చాలా మందికి అనేక సందేహాలున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిప్స్, సర్క్యూట్లు కనెక్టర్లుగా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇది తుప్పు పట్టకుండా ఉండడంతో పాటు అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది. దీనిని నికెల్, కోబాల్ట్ వంటి లోహాలతో కలిపి ఉపయోగిస్తే మరింత మన్నిక కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి 'ఈ వేస్టేజీ' పేరుకుపోతున్న తరుణంలో ప్రపంచంలోని బంగారంలో 7 శాతం వరకు ఈ-వ్యర్థాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకే వాటి నుంచి బంగారాన్ని వేరు చేసి తీయడానికి ప్రత్యేకంగా రెండు సాంకేతికత పద్ధతులను అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు.

ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం గతంలో సంప్రదాయ పద్ధతులను ఉపయోగించేవారు. దీంతో వాతావరణ కాలుష్య సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. పైగా బంగారాన్ని వెలికితీయడానికి శక్తివంతమైన రసాయనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిల్లో సైనైడ్ కూడా కలిసి ఉండడం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అందుకే అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు హానికరమైన రసాయనాలను ఉపయోగించకుండా వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు.(పరిశోధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ మేరకు కొత్తగా వినైల్ లింక్డ్ కోవాలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌లను (VCOF) కనుగొన్నారు. రంధ్రాలతో కూడిన స్ఫటికాకార పదార్థాలైన వీటితో పాటు టెట్రాథియోఫుల్వాలీన్ (TTF), టెట్రాఫెనైల్ ఇథిలీన్ (TPE) ఉపయోగించి శాస్త్రవేత్తలు రెండు రకాల VCOFలను ఆవిష్కరించారు.

టెట్రాథియోఫుల్వాలీన్ తో తయారైన్ VCOF 99.99 శాతం బంగారాన్ని వెలికితీసే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేల్చారు. ఇందులో బంగారాన్ని సహజంగానే ఆకర్షించే సల్ఫర్ పుష్కలంగా ఉండడంతో పాటు నికెల్, రాగి లాంటి ఇతర లోహాలను తక్కువ స్థాయిలో ఆకర్షిస్తోందట. అంతేకాకుండా ఈ ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ కార్బాక్సిలేషన్ ప్రక్రియ వల్ల ఈ వేస్టేజీ సైతం సేంద్రియ పదార్థాలుగా మారుతోందని పరిశోధకులు అంటున్నారు. ఈ వినూత్న ప్రక్రియ ఎలక్ట్రానిక్ పదార్థాల వేస్టేజీ సమస్యకు చక్కని విరుగుడుగా ఉపయోగపడుతోందని తెలిపారు.

బొడ్డుతాడు ప్రాధాన్యమేంటి! - సెలబ్రిటీలు ఎందుకు దాచుకుంటున్నారు?

శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'

ABOUT THE AUTHOR

...view details