తెలంగాణ

telangana

'ఝార్ఖండ్'పై చర్చకు పట్టు- లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్​- ఉభయ సభలు వాయిదా

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 10:27 AM IST

Updated : Feb 2, 2024, 9:07 PM IST

Parliament Budget Session 2024 : పార్లమెంటులో శుక్రవారం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగింది. ఝార్ఖండ్​ రాజకీయాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మరోవైపు, ఉభయసభలు ఫిబ్రవరి 5కు వాయిదా పడ్డాయి.

Parliament Budget Session 2024
Parliament Budget Session 2024

  • 9.05PM
    లోక్​సభ ఫిబ్రవరి 5కు వాయిదా పడింది. శని, ఆదివారాలు సమావేశాలకు విరామం ఉంటుంది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది.
  • 6.10PM
    రాజ్యసభ సోమవారాని(ఫిబ్రవరి 5)కి వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది.
  • 12.39PM

ఝార్ఖండ్ రాజకీయ సంక్షోభంపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్​లో ప్రశ్నలు లేవనెత్తారు. అందుకు సభాపతి అంగీకరించకపోవడం వల్ల లోక్‌సభ నుంచి ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • 11.30 AM

జేఎంఎం నేత హేమంత్ సోరెన్​ అరెస్ట్​ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో వాగ్వాదం జరిగింది.

  • 11.07 AM

పార్లమెంట్​ ఉభయసభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.

  • 10.37 AM

జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్​లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

  • 10.26 AM

Parliament Budget Session 2024 :పార్లమెంటులో శుక్రవారం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. మరోవైపు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్​లో సమావేశమవ్వనున్నారు.

Last Updated : Feb 2, 2024, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details