Man Climbed High Voltage Pole Viral Video : భార్య కాపురానికి రావడం లేదని హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త.. చివరకు..!
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Oct 5, 2023, 6:04 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2023/640-480-19689213-thumbnail-16x9-high-voltage-pole-viral-video.jpg)
Man Climbed High Voltage Pole Viral Video : భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్లోని సైదాబాద్లో చోటుచేసుకుంది. సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంఖేశ్వర బజార్.. స్థానిక సింగరేణి కాలనీలో మోహన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. గత కొన్ని రోజులుగా మోహన్ మద్యానికి బానిస కావడంతో.. అతడి భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తి.. భార్య కాపురానికి రావడం లేదని మద్యం సేవించి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
Person Climbing High Voltage Pole Video Viral : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యుత్ అధికారులకు ఫోన్ చేయడంతో కరెంట్ నిలిపివేశారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు విద్యుత్ స్తంభం ఎక్కిన మోహన్ భార్యను పిలిపించి సముదాయించడంతో.. అతడు కిందకు దిగాడు. అనంతరం మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ ఇలా హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభం ఎక్కడం రెండేళ్లలో ఇది నాలుగోసారని స్థానికులు తెలిపారు.
TAGGED:
శంఖేశ్వర బజార్ సైదాబాద్