![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9335870-504-9335870-1603842509477.jpg)
పసిబాలుడిని ఓ స్వామీజీ ఒంటి చేత్తో ఎత్తుకుని అగ్ని గుండాన్ని దాటాడు. కర్ణాటక రత్తిహల్లి తాలూకాలోని బల్లాపుర గ్రామంలో జరిగిందీ ఘటన. విజయదశమి రోజు బల్లాపురలోని దుర్గాదేవి ఆలయంలో అగ్నిగుండాలపై నడవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది బసవరాజప్ప అనే స్వామీజీ ఒక చేత్తో కత్తిని, మరో చేత్తో బాబును పట్టుకుని ఇలా నిప్పుకణికలను దాటాడు. బాలుడికి ఏమైనా అవుతుందోమోనని స్థానికులు భయపడ్డారు.