యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్సీ లలిత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామివారికి స్వర్ణ పుష్పార్చన పూజలు జరింపించారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం అర్చకులు వారికి శాస్త్రోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. దర్శనం తర్వాత యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ