ETV Bharat / state

యాదాద్రిలో పవిత్రోత్సవాలు.. పాల్గొన్న అటవీశాఖ ఏడీజీ - యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

యాదాద్రి ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. పాల్గొన్న అటవీశాఖ ఏడీజీ
యాదాద్రి ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. పాల్గొన్న అటవీశాఖ ఏడీజీ
author img

By

Published : Jul 30, 2020, 5:17 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాల అనంతరం వచ్చే నెల 1 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే, ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనాలని అర్చకులు కోరారు..

పవిత్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు.



యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాల అనంతరం వచ్చే నెల 1 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే, ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనాలని అర్చకులు కోరారు..

పవిత్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు.



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.