ETV Bharat / state

హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు

author img

By

Published : Mar 1, 2020, 9:34 AM IST

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజున లక్ష్మీనరసింహస్వామి హంస వాహనంపై ఊరేగారు. వజ్రాభరణాలంకరుడై... రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిచ్చారు.

YADADRI BRAHMOSTAVALU HELD IN A GRAND WAY
YADADRI BRAHMOSTAVALU HELD IN A GRAND WAY

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు హంసవాహనంపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రాభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

భక్తకోటిలోని అజ్ఞానం తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించు తత్వమే హంస రూపంలోని పరమార్థమని అర్చకులు వివరించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు.

హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు హంసవాహనంపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రాభరణాలు, రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

భక్తకోటిలోని అజ్ఞానం తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించు తత్వమే హంస రూపంలోని పరమార్థమని అర్చకులు వివరించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు.

హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.