ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని తెజస పట్టభద్రుల ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. తెరాస పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భవనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో నంబర్పై ఓటు వేసి తనను గెలిపించాలని పట్టభద్రులను కోరారు.