కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్ మండల కేంద్రంలోని కూడళ్లలో వాల్ పెయింటింగ్ వేయించారు. కరోనాను తరిమికొడదాం.. లాక్డౌన్ పాటిద్దాం, మాస్కులు ధరించాలి అంటూ గోడలపై రాయిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచనలు సలహాలు తాను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నానని సర్పంచ్ శిరీషా చెప్పారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని హర్షం వ్యక్తం చేశారు.
ఇది చూడండి: కరోనా గురించి వారికి ఇంకా తెలియదట!