ETV Bharat / state

'ఐసోలేషన్​ కేంద్రంగా ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల'

author img

By

Published : May 18, 2021, 4:57 PM IST

యాదగిరిగుట్టలో కొవిడ్ ఐసోలేషన్​ సెంటర్​గా ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల మారనుంది. కొవిడ్ బాధితుల కోసం... ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి తెలిపారు.

mla sunitha
mla sunitha

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొవిడ్ ఐసోలేషన్​ సెంటర్​గా ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలను మారుస్తామని.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ బాధితుల కోసం... ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఐసోలేషన్​ సెంటర్​కు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఐసోలేషన్ సెంటర్​ నిర్వహణకు యాదాద్రిలోని రాష్ట్ర ఆర్యవైశ్యసంఘం ముందుకు వచ్చింది. అవకాశం ఇస్తే... తాము కూడా ఐసోలేషన్​ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. ఎమ్మెల్యేకు హమీనిచ్చింది. కరోనా రోగుల అవసరాల నిమిత్తం కొత్తగా మరిన్ని ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొవిడ్ ఐసోలేషన్​ సెంటర్​గా ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలను మారుస్తామని.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ బాధితుల కోసం... ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఐసోలేషన్​ సెంటర్​కు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఐసోలేషన్ సెంటర్​ నిర్వహణకు యాదాద్రిలోని రాష్ట్ర ఆర్యవైశ్యసంఘం ముందుకు వచ్చింది. అవకాశం ఇస్తే... తాము కూడా ఐసోలేషన్​ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. ఎమ్మెల్యేకు హమీనిచ్చింది. కరోనా రోగుల అవసరాల నిమిత్తం కొత్తగా మరిన్ని ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.