యాదాద్రి పంచనారసింహుల క్షేత్రంలో దైవారాధన, భక్తుల పుణ్యస్నానాల కోసం వేర్వేరుగా పుష్కరిణిల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపై ఆలయ సన్నిధిలో గల విష్ణు పుష్కరిణిని రూ.4.01 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. ఆలయోత్సవాల్లో భాగంగా జరిపే కార్యక్రమాల కోసం ఈ పుష్కరిణిని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్కరిణి మధ్యలో కృష్ణ శిలతో మండపం నిర్మించారు.
పూజారుల దుస్తుల మార్పిడికి 7 గదులను కట్టారు. ఉత్సవ వేడుకలను తిలకించే భక్తుల కోసం నలువైపులా బండ్ ఏర్పాటవుతోంది. కొండకింద గండిచెరువు వద్ద భక్త జనుల పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా పుష్కరిణి నిర్మాణం చేపట్టారు. రూ.6.67 కోట్ల ఖర్చుతో లక్ష్మీదేవి పేరిట పుష్కరిణి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు చోట్ల చేపట్టిన పనులను మరింత వేగవంతం చేశారు.
ఇదీ చూడండి: ఈ దారులు.. రహదారులయ్యేదెపుడు!