రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉదయం 9 గంటలైనా మంచు వీడలేదు. వెలుతురు రాకపోవడం వల్ల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, విద్యార్థులు, ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య దిశల గాలుల్లో తేమ శాతం పెరగడం వల్ల పొగమంచు ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.