హజీపూర్ ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నల్గొండ న్యాయస్థానం ఆదేశాల మేరకు మరోసారి నిందితుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మనీషా, కల్పనకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు. హజీపూర్ శివారులోని బావి వద్ద కల్పన పాఠశాల గుర్తింపుకార్డు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఠాణా వెనుక ఉన్న కర్కలమ్మకుంట వద్ద నీటి కుంటల్లో మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేపట్టారు. మనీషా ఆధార్కార్డు లభ్యమైంది.
దర్యాప్తులో భాగంగా గత నెలలో ఐదురోజుల పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు రాబట్టలేకపోయారు. మరోసారి నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు కోర్టు మూడు రోజులు అనుమతినిచ్చింది. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని బొమ్మలరామారం, హాజీపూర్ తీసుకెళ్లి కీలక ఆధారాలు గుర్తించారు.
ఇదీ చదవండి: అమ్మాయిల పేర్లు చెట్లపై చెక్కిన సైకో