యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ సాయి మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథునికి అభిషేకం నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో సాయి నామ స్మరణ, భజనలు, ఆరాధనలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం వంటి కార్యక్రమాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః చాక్లెట్ల కోసం వెళ్లిన 59 మంది బాలికలపై అఘాయిత్యం