కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్లో పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం వరంగల్ మహానగరంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్కు ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఓరుగల్లును ఫ్యూచర్ సిటీగా మార్చేందుకు కృషి: ఎర్రబెల్లి
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్కు ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శంకుస్థాపన చేశారు. ఓరుగల్లును ఫ్యూచర్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
![ఓరుగల్లును ఫ్యూచర్ సిటీగా మార్చేందుకు కృషి: ఎర్రబెల్లి Minister Errabelli , chief whip Vinay Bhaskar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11396982-thumbnail-3x2-kee.jpg?imwidth=3840)
ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్కు శంకుస్థాపన చేయడం.. సంతోషించదగ్గ విషయమని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో వరంగల్ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వం హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా, వరంగల్ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ... అభివృద్ధి, సంక్షేమాలను విజయవంతంగా ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్
కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్లో పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం వరంగల్ మహానగరంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్కు ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్కు శంకుస్థాపన చేయడం.. సంతోషించదగ్గ విషయమని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో వరంగల్ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వం హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా, వరంగల్ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ... అభివృద్ధి, సంక్షేమాలను విజయవంతంగా ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్