ETV Bharat / state

వరంగల్​లో పటిష్టంగా అమలవుతున్న లాక్​డౌన్

author img

By

Published : May 26, 2021, 1:12 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతోంది. వరంగల్ సీపీ తరుణ్ జోషియే స్వయంగా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు.

Lockdown strictly implemented in Warangal
వరంగల్​లో పటిష్ఠంగా అమలవుతున్న లాక్​డౌన్

కరోనా రెండో దశ ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో వరంగల్ పోలీసులు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది దాటితే అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 టికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హన్మకొండలోని పలు కాలనీల్లో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లాక్​డౌన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 559 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

మాస్కు ధరించని 3254 మందికి జరిమానా విధించారు. లాక్​డౌన్ సమయంలో అవసరం లేకుండా బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు వచ్చి పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా రెండో దశ ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో వరంగల్ పోలీసులు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది దాటితే అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 టికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హన్మకొండలోని పలు కాలనీల్లో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లాక్​డౌన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 559 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

మాస్కు ధరించని 3254 మందికి జరిమానా విధించారు. లాక్​డౌన్ సమయంలో అవసరం లేకుండా బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు వచ్చి పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి : 'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.