హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ప్రధాన మార్గంగా ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని ఫాతిమా వంతెనను విస్తరించి నూతన నిర్మాణాన్ని చేపట్టాలంటూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి సరిపోవడం లేదని ఏవైనా ప్రమాదాలు జరిగితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైన బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నెలలోపు నూతన వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: నూతన చట్టం.. అవినీతి రహిత పాలనే లక్ష్యం