బాలల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన వాకథాన్ను జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మహేశ్ దత్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు బాలల సంరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు.
బాలల హక్కులు, రక్షణ-సంరక్షణ పై అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు 'చైల్డ్ లైన్ సే దోస్తీ' వారోత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు