అధికారపార్టీకీ రెబల్స్ బాధ తప్పేట్టు లేదు. వరంగల్ రురల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ఉన్న 22 వార్డుల్లో 18 వార్డులకు అధికార పార్టీ తెరాస అభ్యర్థులను ప్రకటించింది. ఒక్కొక్క స్థానానికి 6 నుంచి 7 గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
టికెట్ రాని అభ్యర్థులు అసంతృప్తులుగా మారి స్వతంత్రంగా బరిలో దిగి తమ సత్తా చాటుతామంటున్నారు. టికెట్ సంపాదించిన అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'