లాక్డౌన్ గురించి రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్ పల్లి, కిష్టాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి : మిస్ కాల్ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు