వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కు హరించారని భాజపా నాయకులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 22వ వార్డు అభ్యర్థి భద్రయ్య కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక డాక్టర్ సంతోష్.. భాజపా నిబద్ధత మాత్రమే ఇప్పుడు ప్రజలకి ఓటు హక్కు కల్పించిందని అన్నారు. అందుకే తాను భాజపా ప్రచారంలో పాల్గొనని తెలిపారు. అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని... ఓటును కమలం గుర్తుకు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్