వికారాబాద్ జిల్లా అనంతగిరిలో వెలసిన అనంతపద్మనాభ స్వామి వారిని లఖ్నవూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంగీత.. తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రత్యేకతతో పాటు స్థల పురాణాన్ని పూజారులు వివరించారు. ఆమెతో పాటు వికారాబాద్ జడ్జి జస్టిస్ కవిత, ఎమ్మార్వో, సీఐ ఉన్నారు.
ఇదీ చూడండి: జర్నలిస్టులకు సురవరం ఆదర్శం: ఎర్రబెల్లి