వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగన్పల్లిలో హోం క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు కేఎస్ఆర్ ట్రస్ట్ అధినేత శరత్ రెడ్డి. కరోనా కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రాలేక సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతోపాటు మరిన్ని సరకులను పంపిణీ చేసిసనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, జనగం వెంకట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!