రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుచోట్ల దాడులు జరిపిన సిబ్బంది.. తాజాగా.. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో 250 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నారం గ్రామానికి చెందిన వేమారెడ్డి... నకిలీ పత్తి విత్తనాలను నిల్వ చేశారనే సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వేమారెడ్డిపై కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: హృదయ విదారకం: పాడె మోసేందుకు ఆ నలుగురూ రాలేదు!